Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తులకు ఓటు వేయండి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుడు జ్వాలాపురం శ్రీకాంత్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తులకు తమ ఓటు ద్వారా వారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుడు జ్వాలాపురం శ్రీకాంత్ పేర్కొన్నారు. విద్యారణ్య ఓరియంటల్ స్కూల్లో పట్టభద్రుల స్థానంలో పోటీ చేస్తున్న వారికి జ్వాలాపురం శ్రీకాంత్, విష్ణు శ్రీమతి సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోవు కాలంలో గ్రామస్థాయి, నియోజకవర్గ స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి ఉన్నత ఆశయాలు, ఉన్నత వ్యక్తిత్వం కలిగి ప్రజల సమస్యలను పరిష్కరించే వ్యక్తులకు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img