Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఐకమత్యంతో మన హక్కులను సాధించుకుందాం

విశాలాంధ్ర ` శెట్టూరు : వాల్మీకులు అన్ని రంగాల్లో ఐకమత్యంతోనే పోరాడి మన హక్కుల సాధించుకోవాలని వాల్మీకి మండల నాయకులు బోయ వీరాంజనేయులు, బోయ తిప్పేస్వామి వైట్‌ కిష్టప్ప పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం నూతనంగా నిర్మించిన వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ వాల్మీకి ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు ముందుగా గ్రామ పూర్వ వీధులు మహిళల పెద్ద ఎత్తున జ్యోతుల ప్రదర్శించుకుంటూ వాల్మీకులు ఐక్యత చాట చెపుతూ ముందుకు సాగారు వారు మాట్లాడుతూ,వాల్మీకులు ఐక్యమత్యంగా ముందుకు సాగితే హక్కులు సాధించుకోవచ్చని అన్నారు.వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని,వాల్మీకులు ఒకే సంఘం.,ఒకటే లక్ష్యంతో చేసే పోరాటం మనకు ఫలితాన్నిస్తుందన్నారు. రాష్ట్రంలో వాల్మీకి సాధనకై పోరాటం సాధించుకుంటామని వారు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడవాలని వారు సూచించారు. అనంతరం వాల్మికి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కుమార్‌, ఎమ్మెస్‌ హనుమంత రాయుడు, టి ఆర్‌ తిప్పేస్వామి,చటాకుల రామాంజనేయులు, సర్వే చంద్ర, రంగనాథ్‌, ఓబులయ్య, రాము, మల్లికార్జున, వన్నూరు స్వామి, ఆదిశేషు, నగేష్‌, నాగరాజ, తెప్పయ్య, నాగరాజు,జయ రాములు కరెంట్‌ మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img