Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కరాటే లో ప్రతిభ చూపిన సాయి ప్రియ విద్యార్థిని

విశాలాంధ్ర ..ధర్మవరం : ఈ నెలలో కేరళ రాష్ట్రంలోని తిరువూరులో జరిగిన 3.4.5లో వీ ఎన్ కె ఇండోర్ స్టేడియం 2 కే లో ఇండియా సౌత్ ఉమెన్స్ జూడో ఛాంపియన్షిప్ పోటీలలో ధర్మవరం ఆర్డిటి జూడో క్లబ్ తరఫున పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న సాయి ప్రియ కరాటేలో మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని జూడో కోచ్ ఇనాయత్ భాష తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ కరాటేలో అండర్- 14, మైనస్ 32 క్యారెట్ లో పాల్గొని బ్రాంచ్ మెడల్ సాధించిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి కమిటీ బండారు ఆదినారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరీ వర కుమారి తో పాటు ఉపాధ్యాయ బృందం ఆ విద్యార్థిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థినీలకు క్రీడల్లో ఎంతవరకైనా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భూపాల్ లో జరగబోయే ఆల్ ఇండియా జూడో ఛాంపియన్షిప్ లో సాయి ప్రియ పాల్గొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కరాటే విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img