విశాలాంధ్ర- జేఎన్టీయూఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనుబంధ ప్రతి కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ , అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య జింకరంగా జనార్ధన్ పేర్కొన్నారు. మంగళవారం పరిపాలన భవనంలోని సెమినార్ హాల్లో ఎన్ఏఏ అడ్వజరీ కమీటీ తో ఆన్ లైన్ లో ఐ క్యూ ఏ సి డైరెక్టర్ కార్యాలయంలో అనంతపురం, పులివెందుల , కలకిరి ఇంజినీరింగ్ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులతో ఉపకులపతి సమీక్షించారు.ఎన్ఏఏ గుర్తింపు విశ్వవిద్యాలయ ప్రగతి ప్రమాణాలు మెరుగుకు కొలమానంగా మార్గదర్శకం ఇస్తుందన్నారు, బోధన, పరిశోధన, సృజనాత్మక ,నైపుణ్యాలు, నవ్య ఆవిష్కరణలు మొదలగు అంశాలపై దృష్టి సాధించాలన్నారు. 01. సమీక్షిస్తున్న ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్.