Friday, April 26, 2024
Friday, April 26, 2024

గజ వాహనములో ఊరేగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణబ్రహ్మ రథోత్సవంలో స్వామివారికి 117 వ బ్రహ్మ రథోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా శుక్రవారం స్వామివారిని గజ వాహనశీ లో శ్రీవారిని పురవీధుల గుండా ఊరేగించారు, ఈ కార్యక్రమానికి వంశాక్రమానుగత వెచ్చం అమర్నాథ్ ,కుమారులు, సుమన్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ పవన్ కుమార్,ల వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం నుంచి నిత్యారాధన నిత్య హోమ బలి హరనాధులు అభిషేకములు, అర్చనలు, స్వామివారికి నిరాటంకంగా దీపాలంకరణ సేవ, అన్నమాచార్య సంకీర్తనలు వృషభద్రి సంగీత కమిటీ వారిచే ఫార్మేట్ ఉత్సవం నిర్వహించారు, ఈ ఏడాది స్వామివారికి గజ వాహనాన్ని అనంతపురానికి చెందిన హరిబాబు గౌడ్ ,వారి భార్య శ్రీదేవి, వారి కుటుంబ సభ్యులు,స్వామివారికి గజ వాహనాన్ని బహుకరించారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు గజవాహనాన్ని బహుకరించినందుకు ఆలయ ధర్మకర్తలు ఆలయ పాలకమండ సభ్యులు వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు , ఈ కార్యక్రమంలో యాడికి నాగరాజు, శ్రీనివాసులు, సుధాకర్ గుప్తా, కన్నా స్వామి, అనేకమంది స్వామి వారి భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img