Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గవి మఠం రాథోత్సవానికి ఆహ్వానం

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో వెలిసిన గవి మఠం చంద్రమౌళీశ్వర స్వామి మహా రథోత్సవం మార్చి 1వ తేదీన జరుగునున్న దృష్ట్యా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని శుక్రవారం ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డిని, గవి మఠం అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించి ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి మహా రథోత్సవానికి సంబంధించిన ఏర్పాటు గురించి ఆమెతో చర్చించారు. హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని అదనంగా చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img