Friday, April 26, 2024
Friday, April 26, 2024

గెలుపు లక్ష్యంతో పని చేయాలి.. ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి

విశాలాంధ్ర.. ధర్మవరం: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రజా సంఘాల కమిటీ సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు, శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఐక్యమత్యంతో, సమన్వయంతో పని చేసినప్పుడే విజయం లభిస్తుందని సిపిఐ, సిపిఎం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిఐటియు జిల్లా నాయకులు ఇంతియాజ్‌ ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పోలా రామాంజనేయులు-సిపిఎం, జింకా చలపతి-సిపిఐ, సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బయన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్‌ ఖాన్‌, జిల్లా సహాయ కార్యదర్శి జే వి రమణ, నాయకులు కుల్లాయప్ప, మహదేవ్‌ ,నామాల నాగార్జున, పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img