Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఘనంగా జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని పలు కళాశాలలు, పాఠశాలలో మంగళవారం భారతీయ సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా స్త్రీల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి ,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img