Friday, April 26, 2024
Friday, April 26, 2024

జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారుడు ఎంపిక

విశాలాంధ్ర.. ధర్మవరం: ఈనెల 27వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రం చెంగలపట్టు జిల్లాలోని కర్తనకులుతుర్ పట్టణములోని ఎస్ఆర్ఎం కాలేజీ నందు జరిగే జాతీయస్థాయి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ జట్టు నందు ధర్మవరం పట్టణానికి చెందిన వి సంజయ్ కుమార్ రెడ్డి ఎంపికైనట్లు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆత్మీయ ట్రస్టు చైర్మన్ జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ సంజయ్ కుమార్ రెడ్డి గత నెలలో యూనివర్సిటీ స్థాయి పోటీల్లో అనంతపురం నగరంలోని ఎస్ ఎస్ బి ఎన్ కాలేజీ జట్టుకు నాయకత్వం వహించి జట్టును విజేతగా నిలపడడంలో కీలక పాత్రను వహించారని తెలిపారు. ఇటువంటి క్రీడాకారుడు జాతీయ సాయి పోటీలకు ఎంపిక కావడం నిజంగా ఆనందించదగ్గ,గర్వించదగ్గ విషయమని అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జయ చంద్ర రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుళ్ల తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img