Friday, April 26, 2024
Friday, April 26, 2024

జాతీయ రైతు దినోత్సవానికి ఆహ్వానం

విశాలాంధ్ర`ఉరవకొండ : ఈనెల 23 వ తేదీన ఉరవకొండ పట్టణంలో జై కిసాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ రైతు దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలకు తప్పక రావాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ని జైకిసాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నాగమల్లి ఓబులేసు, సభ్యులు షేక్షావలి, వీరాంజీనేయులు, సురేంద్ర, రమేష్‌,దాదావలి, కోమలి, లక్ష్మీ తదితరులు ఆహ్వానించారు. మంగళవారం ఉరవకొండ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ని ఎస్కె హైస్కూలులో జైకిసాన్‌ సభ్యులు కలిశారు.ఆహ్వాన పత్రికను అందజేశారు.అదే విదంగా అందుకు సంబంధించిన పోస్టర్లను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించారు.ఈ రైతు దినోత్సవ కార్యక్రమంలో రైతుల ఔన్నత్యం, వ్యవసాయ ప్రాధాన్యత తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయనకు చెప్పారు. కావున మీరు తప్పక హాజరు కావాలని ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img