విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డ్ మెంబర్ గా ఉరవకొండకు చెందిన జిఎంఎస్ మీరం బాషా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సీఈఓ అబ్దుల్ ఖదీర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అధ్యక్షుడుగా రిజ్వాన్,ఉపాధ్యక్షుడుగా అహమ్మద్ బాషా, కార్యదర్శిగా నూర్ తో కలిపి మరో 7 మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది.ఈ సందర్భంగా మీరం బాషా విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు మెంబర్ గా నన్ను నియమించేందుకు కృషి చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డికి, నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకముతో ఈ బాధ్యతలను అప్పగించారని తాను కూడా బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ముస్లింల సంక్షేమానికి పాటుపడతానని, వక్ఫ్ ఆస్తులు పరిరక్షణ, మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని మీరం బాషా తెలిపారు. వక్ఫ్ బోర్డ్ మెంబర్ గా నియామకం పట్ల పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మీరం భాషా కు అభినందనలు తెలియజేశారు.