Friday, April 26, 2024
Friday, April 26, 2024

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టిడిపి నాయకులు

విశాలాంధ్ర- ధర్మవరం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని తెలుపుతూ నల్ల బ్యాడ్జీలతో టిడిపి నాయకులు శనివారం నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు కమతం కాటమయ్య, పని కుమార్, పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే సభను వైసీపీ అడ్డుకుంటుందని దీన్ని బట్టి చూస్తే వైసిపి గుండెల్లో గుబులు పుడుతోందని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా టిడిపి నాయకులపై కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. వచ్చే ప్రభుత్వం టిడిపి ప్రభుత్వమేనని వారు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుకుంట లక్ష్మన్న, కృష్ణాపురం జమీర్ అహ్మద్, పటాన్ బాబు ఖాన్ ,మారుతి స్వామి, వరదరాజులు, గోశాల శ్రీరాములు చీమల రామాంజి, చీమల నాగరాజు, బిరే శీనా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img