Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

పక్షవాత వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం.

విశాలాంధ్ర-తాడిపత్రి: గన్నెవారిపల్లె లోని ఐశ్వర్య విల్లాస్ కాలనీలో నివాసం ఉంటున్న కడూరి చక్రవర్తి రాజుకి వైసీపీ నాయకుడు ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐశ్వర్య విల్లాస్ లో నివాసం ఉంటున్న కడూరి చక్రవర్తి రాజుకి ఆరు నెలలు క్రితం పక్షవాతం రావడంతో ఒక కాలు, చెయ్యి, మాటలు పడిపోయాయి. ఈయనకు కిడ్నీలు పాడైపోయి ఒక కిడ్నీ పూర్తిగా తీసివేశారు. ఇంకో కిడ్నీకి, గుండెకు స్టంట్ వేశారు. జీవితాంతం మందులు వాడాలి. ప్రతి నెల వైద్యానికి, మందులకు దాదాపు పదివేల రూపాయలు ఖర్చు అవుతోంది. వీరి వద్ద వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు ఫోన్ పే: 7337407678 నెంబర్ కు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. రాజశేఖర్ రెడ్డి,రాజారెడ్డి,హుస్సేన్ భాష,మావలి,వెన్నపూస అమర్నాథ్ రెడ్డి,దస్తగిరి,ఆనంద్,రవిశంకర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img