Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెట్రోల్‌ పైపులను కత్తిరించిన దుండగులు

ఆందోళన వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో అయ్యప్ప స్వామి భక్తుల మోటార్‌ బైకులు కు సంబంధించిన పెట్రోల్‌ సరఫరా చేసే పైపులను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించడంతో పెట్రోల్‌ మొత్తం నేల పాలయ్యింది.దీంతో అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా దేవాలయం బయట పార్కింగ్‌ చేసిన దాదాపు 20 మోటార్‌ బైకులకు సంబంధించిన పెట్రోల్‌ సరఫరా అయ్యే పైపులను కత్తిరించడం జరిగింది.ఈ సంఘటనపై గురువారం ఉదయం అయ్యప్ప స్వామి భక్తులు ఉరవకొండ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దుండగులను గుర్తించి శిక్షించాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img