Friday, April 26, 2024
Friday, April 26, 2024

మానసికోల్లాసానికి క్రీడలు.

విశాలాంధ్ర-గుంతకల్లు : మానసికోలాసానికి క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయని గుంతకల్లు తాహశీల్దార్ బి.రాము తెలిపారు. స్థానిక రైల్వే గ్రౌండ్ లో ఎస్ జి చాలెంజెస్ ట్రోఫీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలోని ఓ మ్యాచ్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటలను సహజమని వాటిని సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తితో తీసుకుని క్రీడలలో పాల్గొనడం మంచిదని క్రీడాకారులకు సూచించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని మ్యాచ్ ను ప్రారంభించారు. ఉదయం నిర్వహించిన మ్యాచ్లో రైల్వే క్యాంపు ఏమో 11 వండర్స్ టీం పై విజయం సాధించింది మధ్యాహ్నం బెంగుళూర్ జట్టు మరియు సోఫియా గైస్ జట్ల మధ్య పోటీ జరిగింది. మ్యాచ్ ను వీక్షించేందుకు తెలుగుదేశం నాయకులు రామ గౌని అనిల్ కుమార్ గౌడ్ , సీనియర్ క్రికెటర్లు జోసెఫ్ , ఇనాయతుల్లా తదితరులు తోపాటు ప్రేక్షకులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img