Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రక్తదానం చేసిన విద్యార్థులు

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ ప్రభుత్వ ఐటిఐ కళాశాల మరియు ప్రైవేట్‌ ఐటిఐ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు. గుంతకల్‌ పట్టణానికి చెందిన గోపి చారిటబుల్‌ బ్లడ్‌ సెంటర్‌ నిర్వాహకులు సోమవారం కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదానం శిబిరంలో విద్యార్థుల అనేకమంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు రక్తదానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పేర్కొన్నారు అనేక మంది విద్యార్థులకు బ్లడ్‌ గ్రూపులు కూడా నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img