Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారుడు ఎంపిక

విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రస్థాయిలో ఈనెల ఏడవ తేదీ నుండి 9వ తేదీ వరకు విశాఖపట్నం నగర సమీపంలోని అనకాపల్లి పట్టణంలో జరిగే, అండర్ 19 బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ జట్టు నందు శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారుడు సిరాజ్ ఎంపికైనట్లు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి అండ్ ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ రెడ్డి శుక్రవారం విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయికి సిరాజ్ ఎంపిక కావడం పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుల్ల, ఉపాధ్యక్షులు నిమ్మ చంద్రశేఖర్ , కోచ్ సంజయ్ తదితరులు అభినందన, శుభాకాంక్షలతో,హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img