Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి

విశాలాంధ్ర- ఉరవకొండ : స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలను బుధవారం ఉరవకొండలో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ. వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వడ్డెర్ల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, అలాగే ఉరవకొండ పట్టణంలో ఓబన్న విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని, వడ్డెర్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయాలనిపేర్కొన్నారు. ఉరవకొండలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి 30 సెంట్లు స్థలం ఇవ్వాలని, వడ్డెర్ల ఫెడరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉరవకొండ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అంతకముందు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల కుల సంఘం నాయకులు ప్రభాకర్ శంకరయ్య,గంగరాజు, లాలు స్వామి,చినబాబు పెద్ద సంఖ్యలో వడ్డెర్లు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img