Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వస్తువుల కొనుగోలు విషయంలో వినియోగదారులు జాగ్రత్తలు కలిగి ఉండాలి.. వినియోగదారుల సంఘం

విశాలాంధ్ర ^ధర్మవరం : వస్తువుల కొనుగోలు విషయంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలను పాటించాలని వినియోగదారుల సంఘం అధ్యక్షులు సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని బిఎస్సార్ బాలుర విద్యార్థులతో కలిసి వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి వస్తువు కొనుగోలుకు రసీదు తప్పక పొందాలని, ఏదైనా కొనుగోలు విషయములో ఈ రసీదు తప్పక ఉపయోగపడుతుందన్నారు. వినియోగదారుల హక్కుల గూర్చి రోజువారి కొనుగోలు చేసే వస్తువుల విషయంలో జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా వినియోగదారుల చట్టం 2019 గూర్చి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వస్తువుల నాణ్యత విషయంలో వినియోగదారుల చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యూ
గేశ్వరి దేవి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గౌస్, సిఎస్ డిటి చెన్నకేశవ నాయుడు, ఎఫ్ సి షాపు డీలర్లు, ఎండియు ఆపరేటర్లు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img