Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యార్థులకు బైజుస్‌ ట్యాబ్‌లు పంపిణీ

విశాలాంధ్ర/కదిరి : కదిరి మున్సిపల్‌ పరిధిలోని వీవర్స్‌ కాలనీ మున్సిపల్‌ హై స్కూల్‌ విద్యార్థిని, విద్యార్థులకు బై జూస్‌ ట్యాబులను ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు.ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించడానికి విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంతో మరొక అడుగు ముందుకేసి ఆంగ్ల విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌ స్థాయిలో వసతులు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచారని తెలిపారు.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, కౌన్సిలర్‌ గిరిజమ్మ ఎంపీపీ అమర్నాథ్‌ రెడ్డి జెడ్పిటిసి రాధాబాయి టెంపుల్‌ చైర్మన్‌ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img