విశాలాంధ్ర ` అనంతపురం వైద్యం : వైద్య ఆరోగ్య శాఖలో, ఉమ్మడి జిల్లా ల్లో నీ మహిళా ఆరోగ్య పి హెచ్ సి కార్యకర్తలకు పునర్విభజన ప్రక్రియలో భాగంగా జిల్లా లోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ ఆరోగ్య కార్యకర్తల లో సీనియారిటి మరియు స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ కలిగి ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అలాగే వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని కౌన్సిలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డా.సుజాత ప్రభాకర్ మోసెస్ ఏ ఓ,సీనియర్ అసిస్టెంట్లు కమలాకర్ రాజు, సురేష్ పాల్గొన్నారు.