Friday, April 26, 2024
Friday, April 26, 2024

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర- ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యసాయం రంగంలో అనేక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఉరవకొండ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు వ్యవసాయ శాఖ జెడిఎ చంద్రనాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌,మండల వ్యవసాయ సలహా సంఘం చైర్మన్‌ వెంకటేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి, సూచనలు తెలియజేయటానికి సలహా మండలి సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటైన ‘వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.రాష్ట్రలో ఆర్బికేలు ఏర్పాటు ద్వారా రైతులు ముంగిటికే ఎరువులు.. విత్తనాలు అందివడంతో పాటు అనేక సలహాలు, సూచనలు అందిస్తూ, ఈక్రాప్‌ నమోదు చేస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.ఇంతకముందు ఇన్సూరెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని
ప్రస్తుతం ఏసీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ లోనే ఇన్సూరెన్స్‌ సొమ్ము నేరుగా మీ చేతుల్లోకి వచ్చే గొప్ప మార్పును జగన్‌ తెచ్చాడన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇన్సూరెన్స్‌ విధానంతో గత ఏడాది ఒక్క ఉరవకొండ నియోజవర్గం రైతులకే 100 కోట్ల రూపాయలు మేర లబ్ది చేకూరిందన్నారు. అదేవిధంగా పంటలు పండిరచే ఏ రైతన్న తన పంటను అమ్ముకునే విషయంలో నష్టపోకూడదని రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారన్నారు.ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే.. తోడుగా నిలబడేందుకు మరో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలనిధిని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు
రైతు ఆత్మహత్యలు నివారణకు అనేక చర్యలు చేపట్టారన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయన్నారు.
వ్యవసాయం లో అప్పులు కారణంగా రైతన్న ఆత్మహత్య చేసుకుంటే రూ.7 లక్షల పరిహారం అందజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇలా అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను రైతుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ ఉద్యోగులు, ఆర్బికే సిబ్బంది, వ్యవసాయ సలహా మండలి సభ్యులు తీసుకోవాలని అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తే రైతులకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు,వైఎస్‌ఆర్సిపి నాయకులు, రైతులు, ఆర్బికె సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img