Friday, April 26, 2024
Friday, April 26, 2024

షిరిడీ సాయినాథునికి భక్తిశ్రద్ధలతో కార్తీక సమారాధన

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వెలసిన శ్రీ షిరిడీ సాయినాథునికి భక్తి శ్రద్ధలతో కార్తీక సమారాధన నిర్వహించారు. బుధవారం పురోహితులు వాసుదేవరావు సాయినాథునికి ఏకాదశ మాహా రుద్రాభిషేకం, అలంకారం, అర్చన, మంత్రపుష్పం, హారతి, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగబంగారంగా కొలిచే సాయిబాబాకు మహిళలు కుంకుమ పూజ, లలితా సహస్ర నామార్చన చేశారు. భక్తులు, దాతల సహకారంతో ఆరేళ్లుగా ప్రతీ ఏటా కార్తీక సమారాధన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని నిర్వహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img