Friday, April 26, 2024
Friday, April 26, 2024

సచివాలయ ఉద్యోగులు సర్వేలను త్వరితగతిగా పూర్తి చేయాలి.. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున

విశాలాంధ్ర..ధర్మవరం : ప్రస్తుతం పట్టణంలో 08 లో సర్వేనెంబర్లు 508,515-2,532,533-1,533-3, లపై సర్వేలు వేగవంతంగా సచివాలయ ఉద్యోగులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులకు, రెవెన్యూ కార్యదర్శిలకు, టౌన్ ప్లానింగ్ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇటీవలే కలెక్టర్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 08 రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రజల కోరికపై నేడు కలెక్టరేట్ కార్యాలయం ద్వారా సంబంధిత వివరాలు తెలపాలన్న ఉత్తర్వులు మేరకు సర్వేలో గల వివరాలను చేసేందుకు ఈ సమావేశమును నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం పై తెలిపిన 5 సర్వేలలో నివాస గృహాలు, కమర్షియల్, ఖాళీ స్థలాలు తదుపరి వివరాలను పూర్తి దశలో తెలపాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఆయా స్థలాలలో సర్వహక్కుపత్రం కలిగించేందుకు ఆర్డీవో తిప్పే నాయక్ కూడా కృషి చేయడం జరుగుతుందన్నారు. పై సర్వేలలో పూర్తి వివరాలతో కూడిన వాటిని ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ ఈ.సత్యనారాయణ, డి ఈ.వన్నూరప్ప, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img