Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

12న జరిగే ధర్నాను జయప్రదం చేయండి : సిపిఐ

విశాలాంధ్ర`ఉరవకొండ : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 12వ తేదీన సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావాలని ఉరవకొండ తాలూకా సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్‌ పేర్కొన్నారు. ఆందోళనకు సంబంధించిన కరపత్రాలను గురువారం వజ్రకరూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ మరియు రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్‌, సహాయ కార్యదర్శి బి. హనుమంతు, పార్టీ నాయకులు రసూల్‌, షబ్బీర్‌ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img