ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మారుతి రావు
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ సెబ్ స్టేషన్ లో ఎక్సైజ్ నేరములు నందు పట్టుబడిన వాహనాలను ఈనెల 23వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేస్తున్నట్లు ఉరవకొండ ఎన్ ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బి. మారుతీ రావు తెలిపారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలం పాటలలో పాల్గొనదలచిన వారు 5వేలు రూపాయలు డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాటల నిర్వహణపై ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్న స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు.