Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ బహు ప్రయోజనం

విశాలాంధ్ర ధర్మవరం:: ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ బహు ప్రయోజనంగా ఉంటుందని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తా డిమర్రి,ముదిగుబ్బ మండలాలలో ఈనెల ఆరవ తేదీ వరకు ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం 1,98,677 మంది పూర్తి చేసుకున్నారని, ఇంకను 35,559 మంది అనుసంధానం చేసుకోవాల్సి ఉందని, త్వరలోనే అనుకున్న గడువులో పూర్తి చేయడం జరుగుతుందని 84.8 శాతం పూర్తి కావడం జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివరాలకు వెళితే ధర్మవరం రూరల్ 85.6 శాతము, ధర్మవరం అర్బన్ 88.5 శాతము, తాడిమర్రి లో 84.1 శాతము, ముదిగుబ్బలో 78.9 శాతము, బత్తలపల్లి లో 81.2 శాతము పూర్తి అయ్యిందన్నరు. నియోజకవర్గంలో 2,34,236 మంది ఓటర్లు ఉండగా 1,98,677 మంది ఆధార్అనుసంధానమును చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల తాసిల్దార్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img