Friday, April 26, 2024
Friday, April 26, 2024

కౌశిక్ ప్రవీణ్ దాస్ పై వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి

ప్రపంచ మానవ హక్కుల సంఘం

విశాలాంధ్ర ధర్మవరం:: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు కు చెందిన కౌశిక్ ప్రైవేట్ అనే వ్యక్తిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సుప్రీం కోర్ట్ ఆదేశాలను సత్వరంగా అమలు పరచాలని మానవ హక్కుల సంఘం జాతీయ కార్యదర్శి నాయని గారి నర్సింహారెడ్డి చైర్మన్ కాసాల కోనయ్య లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్యాలమ్మ ఎంటర్ప్రైజెస్ ధర్మవరం ద్వారా జెసిబి వాహనాలను వారి కంపెనీ కొరకు లీజుకు ఇవ్వడం జరిగిందని, అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగిందన్నారు. కానీ మూడు నెలలు దాటిన వాహనాల అధ్య ఇవ్వకుండా, దాటవేస్తున్నారని, తమ జెసిబి వాహనాలు కూడా కనబడటం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని ఈనెల 5వ తేదీ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై అండ్ సీఐకు తెలిపిన కూడా ఏ ఒక్కరు కూడా కంప్లీట్ను తీసుకోలేదని తెలిపారు. ఈ మేరకు గురువారం నాడు రూరల్ పోలీస్ స్టేషన్లో మానవ హక్కుల సంఘం నాయకులు 30 మందితో వెళ్లడం జరిగిందని, సత్వరంగా న్యాయం చేయకపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి నిరసన తెలుపుతామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img