Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం.. ట్రాఫిక్ సిఐ వహీద్ భాష

విశాలాంధ్ర- ధర్మవరం : చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని ట్రాఫిక్ సిఐ వహీద్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, ఎర్రగుంట వైయస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్ర కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ వహీద్ భాష ప్రారంభించారు. అనంతరం వహీద్ భాషా మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర భారీ వాహన డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ హక్కుల సాధన సమితి ధర్మవరం వారు చేపట్టిన చలివేంద్ర కేంద్రాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయన్నారు. పట్టణమునకు గ్రామీణ ప్రాంత ప్రజలే కాకుండా పట్టణంలోని పలు వీధులలో ఉండే ప్రజలు కూడా వస్తారని, ఎండ తీవ్రత ఉండడంతో ఈ చలివేంద్రాలు ప్రజల దాహార్తిని ఎంతగానో తీర్చడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. చలివేంద్రాలు ఏర్పాటు పట్ల ఈ సంఘాన్ని సీఐ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హరికృష్ణ ,కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి రమేష్, సభ్యులు శ్రీరాములు, లోకేష్, అశోక్, శివయ్య, హరి, ధనుంజయ, రామంజి, ముస్కిన్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img