Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :మోడీ ప్రభుత్వాన్ని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా కార్య వర్గ సభ్యులు పరమేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణంలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ దుర్మార్గాలను మతతత్వ, కార్పోరేట్ కూటమి దుర్నీతిని ప్రజలు ప్రశ్నించకుండ చేయడానికి బిజెపి ప్రభుత్వం ఎక్కడికక్కడే మతకలహాలు సృష్టిస్తుందని ఆరోపించారు. మనందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులను, మనం కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ సమస్థలను, ఆఖరికి మనకు అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. ఆదాని ఏవిధంగా ప్రపంచాన్ని మోసం చేసి లక్షల కోట్ల కొల్లగొట్టాడో మనందరికి తెలుసన్నారు. అలాంటి అవినీతి ఆదానికి మోడీ మద్దతు ఇస్తూ దేశాన్ని తాకట్టు పెట్టాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇలాంటి అవినీతి పౌరుడు మరోసారి ప్రధానమంత్రి అయితే మన దేశాన్ని తాకట్టు పెట్టడానికి వెనకాడడన్నారు. కావున ప్రజలు బిజెపిని సాగనంపి, దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు, శీను, సిపిఐ శాఖ కార్యదర్శి నరసన్న, వీరేష్, నాగలక్ష్మి, ఎల్లమ్మ, రంగమ్మ, లక్ష్మి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img