Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించాలి

విశాలాంధ్ర – వత్సవాయి : ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళా ఆర్ధిక అభివృద్ధి సాధించాలని కొమరగిరి ట్రస్ట్ కార్యదర్శి, శ్రీ సాయి సెంచరీ ప్రిన్సిపాల్ కొమరగిరి సవితాభరద్వాజ్ అన్నారు.
సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో మక్కపేట లో నిర్వహిస్తున్న ఉచిత బ్యూటీషియన్ కోర్స్ శిక్షణ తరగతులను కొమరగిరి ట్రస్ట్ సెక్రటరీ, శ్రీ సాయి సెంచరీ ప్రిన్సిపాల్ సవితాభరద్వాజ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి, సొంతంగా మెలుకువలు అందించడంతోపాటు వారికి మద్దతుగా సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ వారు సహకరించటం అభినందనీయమన్నారు. రెండు నెలలపాటు నిర్వహించే ఈ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుందని జన శిక్షణ సంస్థాన్ ట్రైనర్ శారదా తెలిపారు. ఈ కార్యక్రమం లో పలువురు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img