Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బుద్ధి మాంద్యం చిన్నారులకు కంటి పరీక్షలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మరియు ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా కదిరి మొటుకుపల్లి ఆర్ డి టి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో మెదడు పక్షవాత చిన్నారులకు,బుద్దిమాంద్యలకు,శారీరక వికలాంగులకు, బుదిరులకు కంటి పరీక్షలు శనివారం నిర్వహించడం జరిగింది. మొత్తం 68 కి కంటి పరిక్షలు నిర్వహించడం జరిగింది.06 మంది పిల్లలకు కంటి అద్దాలు అవసరమని,04 మంది ని హయ్యర్ ఇన్స్టిట్యూట్ కు రెపర్ చేయడం అవసరమని గుర్తించడం జరిగింది. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ఉచితంగా కళ్ళజోడును అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెంబెర్ రిటైర్డ్ తసీల్ధార్ ఎస్ . రియాజుద్దీన్ , ఎల్ వి ప్రసాద్ కోఆర్డినేటర్ ఎం డి రఫిక్ , రెడ్ క్రాస్ కోఆర్డినేట్ బి . రమేష్,సెంటర్స్ ఇంచార్జి సిస్టర్ నక్షత్రమ్మ , హెచ్ ఎం కె నాగ. నగపణి .టెక్నిషియన్లు కృష్ణ ఆర్ డి టి సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img