Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని నందలపాడు, ఆంజనేయ మాన్యం కాలనీలో మంగళవారం పట్టణ ఓబీసీ మోర్చా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగం రెడ్డి అంకాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సాధికారిక కై జీవితాంతం కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అన్నారు. కుల మత రహిత సమాజ నిర్మాణమే ద్వేయంగా దేశ ఆర్థిక ప్రగతికి విద్యా ప్రధాన కారణమని చెప్పిన విద్యావేత్త అని చెప్పారు.వితంతు పునర్వివాహాలకు ప్రాధాన్యత ఇచ్చి గర్భ స్థావ కేంద్రాన్ని పూణేలో నెలకొల్పి ధర్మ పత్ని సావిత్రిబాయి పూలే తో కలిసి బాలికల ఉన్నతికై జీవితాన్ని అంకితం చేసిన స్త్రీ జనోద్ధారకుడు సత్యశోధన సమాజమును స్థాపించారు.దీనబంధు పత్రిక ద్వారా బీదల కార్మికుల సమస్యలను సమాజానికి తెలియజేసిన సంఘసంస్కర్త అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రంగనాథ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గ్రంథాలయ జిల్లా కన్వీనర్ గంగాధర్ ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి మధు రూరల్ కార్యదర్శి సంజీవ బిజెపి ఉపాధ్యక్షులు నాగరాజు కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img