Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ గెలుపు పై ఆనందోత్సవం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు గురువారం జరిగినఎమ్మెల్సీ ఎన్నికలలో విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యురాలు పంచుమ‌ర్తి అనూరాధ కి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేకపోయారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ను మరియు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కార్యకర్తలను నూతన ఉత్సాహము కలుగుతోందని ఆమె తెలిపారు ఆమెతో పాటుగా సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img