Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన మోడల్ స్కూల్ విద్యార్థులు


విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని మోడల్ (ఆదర్శ) స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ప్రతిభను చాటారని ప్రిన్సిపాల్ పద్మశ్రీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మొత్తం 82 మంది పరీక్షలు రాయిగా 73 మంది ఉత్తీర్ణత చెందారని, పాఠశాల 89 శాతము ఉత్తీర్ణతను సాధించిందని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థుల్లో జే. ఆదిశంకర్ 586, ఎం.. మురళీకృష్ణ 586, కె. కృష్ణ తులసి 585, బి. నందిని 583 మార్కులతో రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయ బోధనేతర బృందం వారు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరము పదవ తరగతి పరీక్షా ఫలితాలు ప్రతిభను విద్యార్థులు చాటుతున్నారని మున్ముందు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత అయ్యేటట్లు తగిన కృషిని సలుపుతున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img