Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ కే హెచ్ డిగ్రీ కళాశాలకు ఎన్సిసిసి మంజూరు

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎన్సిసిసి మంజూరు కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, లెఫ్ట్నెంట్ పావని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్సిసి కార్యక్రమాన్ని డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరబోతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్సిసి మంజూరు చేసినటువంటి ఆరు ఆంధ్ర బెటాలియన్ కమాంటింగ్ ఆఫీసర్ ముద్ర కు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సరములో ఉన్న క్యా డేట్స్ కు బి తోపాటు సి సర్టిఫికెట్ల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ సర్టిఫికెట్లు ఉన్నత చదువులలో ఉపయోగపడటమే కాకుండా బి ఎడ్, ఎం ఏ, ఎం సి ఏ, ఎంబీఏ వంటి కోర్సులలో చేరడానికి రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా కేంద్ర రక్షణ దళాలలో రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ శాఖలలో ప్రత్యేక మార్కులను కేటాయించడం జరుగుతుందని, ఎన్సిసి క్యాడెడ్స్ శిక్షణలో భాగంగా క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, ఏకాగ్రత గురించి చక్కగా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ సమైక్యత శిబిరాలలో కూడా పాల్గొనే అవకాశం ఉందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img