Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్పందన కు కరువైన అధికారులు

19 శాఖలు ఉంటే ఏడు శాఖలు మాత్రమే హాజరు

విశాలాంధ్ర : శెట్టూరు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాపన చేపడుతున్న స్పందన కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులు దాన్ని నిర్విరం చేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి మండల తాసిల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవో, ఏపీఎం, విద్యాశాఖ ఏపీవో, ఐసిడిఎస్, ఇంజనీర్, వీళ్ళు తప్ప మిగతా అధికారులందరూ హాజరుకాని అధికారులు అటవీశాఖ, వైద్యశాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, హార్టికల్చర్, నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూజేఈ, రవాణా శాఖ, గృహ నిర్మాణ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, హార్టికల్చర్, దాదాపుగా 12 శాఖల హాజర్ కాకపోవడం దేనికి నిదర్శనమని అక్కడ వచ్చిన ప్రజలు ఒకొక చర్చించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేస్తూ ప్రతి సోమవారం స్పందనకి కి డుమ్మా కొడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో ప్రజల ఆఫీస్ వద్దకు వస్తే తీరా చూస్తే సంబంధిత అధికారులు లేకపోవడంతో నిరుస్తాహంతో వెనుక తిరిగి వెళ్తున్నారు గత కొన్ని నెలల నుంచి ఇలానే జరుగుతుంది మండల సర్వసభ సమావేశంలో తాసిల్దార్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా లెక్కచేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం కి అధికారులను హాజరయ్యే విధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img