Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పొట్టి శ్రీరాముల సేవలు, ప్రాణత్యాగం మరువలేనివి

జిల్లాఎస్పి విద్యాసాగర్

విశాలాంధ్ర, పార్వతీపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగంచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ డా. ఓ. దిలీప్ కిరణ్ లు తెలిపారు.గురువారం పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పొట్టిశ్రీరాములు 123 జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కు చేసిన సేవలు, ప్రాణత్యాగం గురించి వారు కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లోపునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణా రావు , జిల్లా ఆర్మ్ డ్ అధికారులు , పోలీస్ సిబ్బంది, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img