Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సజావుగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆర్డిఓ తిప్పే నాయక్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పోలింగ్ కేంద్రాలలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించామని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం పట్టపద్రులు 12,555 మంది ఉండగా 9,543 మంది ఓటర్లు సద్వినియోగం చేసుకొనగా 76.01 శాతం నమోదయింది అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు మొత్తం 737 మంది ఉండగా 688 మంది ఓటును సద్వినియోగం చేసుకొనగా 93.35 శాతము నమోదయింది అన్నారు. మొత్తం మీద ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించడం పట్ల అధికారులకు, సిబ్బందికి, రాజకీయ వేత్తలకు, సహకరించిన వారందరికీ కూడా ఆర్డిఓ కృతజ్ఞతలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img