Friday, April 26, 2024
Friday, April 26, 2024

సమాజ సేవ చేయుటలో వారికి వారే సాటి

మెహర్ బాబా సెంటర్ నిర్వాహకులు

విశాలాంధ్ర – ధర్మవరం:: సమాజ సేవ చేయుటలో కీర్తిశేషులు పెనుజూరు రమేష్ సేవలు అనన్యమైనవని, సేవలు చేయుటలో వారికి వారే సాటి అని మెహర్ బాబా సెంటర్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా మెహర్ బాబా సెంటర్ ను నిర్వహిస్తూ, అందరి వద్ద మంచి మన్ననలు, మంచి గుర్తింపు పొందిన మహా వ్యక్తి పెనుజూరు రమేష్ అని తెలిపారు. అనంతరం మంగళవారం సాయంత్రం పెనుజూరు రమేష్ మృతి వార్త అందరిని కలిచి వేసింది అని, వారి మృతి తీరని లోటు అని బాధను వ్యక్తం చేశారు. బుధవారం రోజు గిర్రాజు కాలనీలో గల వారి స్వగృహంలో మెహర్ బాబా ప్రేమికులు సంకీర్తన భజనలను నిర్వహించారు. పెనుజూరు రమేష్ కుటుంబం వ్యాపారాన్ని నిర్వహిస్తూ, ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు వృద్ధులకు వివిధ రకాలుగా సేవలు అందించడం జరిగిందన్నారు. మెహర్ బాబా లో కీర్తిశేషులు పెనుజూరు రమేష్ ఐక్యం కావడం, వారి ఆశయ సాధనాల కొరకు అందరూ కృషి చేయాలన్న రు. ఏడు సంవత్సరాలుగా వృద్ధులకు వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించడంతోపాటు, మందులను కూడా పంపిణీ చేస్తూ వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అని తెలిపారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశా రు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది మెహర్ బాబా ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img