విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో జిల్లాలోని పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాలు, కాలనీల బాట పడ్డారు. పోలింగ్ కు మరో రెండు రోజులు వ్యవధి ఉండడంతో సమస్యాత్మక గ్రామాల్లో, కాలనీలలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో ఆ దిశగా నిమగ్నమయ్యారు. కేంద్ర సాయుధ బలగాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలు, ఆయా కాలనీలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం నిర్భయంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు నిర్వహించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ప్రజల్ని కోరారు. అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండాలని ఎన్నికల నియమ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని తెలియజేశారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి కేసుల్లో ఇరుక్కుపోవద్దని సూచించారు.