Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అర్హులకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం : రాప్తాడు మండలం గంగులకుంట గ్రామంలో గురువారం నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గ్రామస్తులు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అడుగడుగునా అప్యాయంగా పలకరించారు. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే మూడేళ్లలో ప్రభుత్వం వల్ల కల్గిన లబ్ధిని వివరించారు. లబ్ధి పత్రాలను ఎమ్మెల్యేగారు అందజేశారు. ఏ ప్రభుత్వంలో నైనా మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయలు మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా? అని ఎమ్మెల్యే గారు అడిగారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని మహిళలు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాల ద్వారా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చేస్తున్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు.

గడిచిన 36 నెలల్లో రూ.1.80 లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇంతటి మేలు చేసిన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడైనా చూశారా తల్లీ. అని అడిగారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. పార్టీలు, కులాలు, మతాలు అనేది చూడకుండా అందరికీ మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మీ ఆశీర్వాదం కావాలి తల్లీ అంటూ కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img