Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్ష టాబ్లెట్లు పంపిణీ

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారం జడ్పీ హెచ్ హైస్కూల్లో ప్రపంచ ఎన్జీవో రోజు సందర్భంగా ఇన్నర్ విల్ క్లబ్ అధ్యక్షురాలు త్రిష్లా బన్సాలి ఆధ్వర్యంలో ఉచిత హిమోగ్లోబిన్ పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం వందమంది విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఐరన్ సప్లిమెంటరీ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాత ఎస్ఎంటి సుప్రజ శెట్టి కి త్రిష్లా బన్సాలి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ క్లబ్ సభ్యులు రేణుక వేల్చూరు,ప్రిన్సిపల్ మోహన్, పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్ఎం వర్కర్ నారాయణమ్మ ,ఎం ఎల్ హెచ్ పి సభ్యురాలు హైమా ,ఆశ వర్కర్ సాయి లత ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img