Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి,పోతుల ని గెలిపించండి….

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు…

విశాలాంధ్ర-గుంతకల్లు : టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజులను గెలిపించాలని ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు అభ్యర్థించారు. గురువారం సీపీఐ, ఏఐఎస్ ఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు,సీపీఐ నియోజికవర్గం కార్యదర్శి వీరభధ్రస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ లు గుంతకల్లు పట్టణంలో శ్రీచైతన్య,బాష్యం,నారాయణ,శ్రీచైతన్య టెక్నో స్కూల లో ప్రచారం నిర్వహించారు. అనంతరం జాన్సన్ బాబు మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు, అధికారాలు, ఆత్మగౌరవం, సిపిఎస్‌ రద్దు, కాంటాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, రాయలసీమ సమగ్ర అభివృద్ధి, రాజకీయాలలో విలువలు, సామాజిక న్యాయం కోసం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి,గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోతుల నాగరాజును గెలిపించాలని కోరారు. చదువుకున్న విద్యావంతులుగా ఓటును ఒక మంచి నాయకునికి వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లయ్య, ఏఐ ఎస్ ఎఫ్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, వెంకట్ నాయక్ ,ఏ ఐఎస్ ఎఫ్ నియోజవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ ,శాంత కుమార్, రాజ్ కుమార్ తదితరులు పట్టభద్రులను, టీచర్స్ ను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img