Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 50వ జన్మదిన పురస్కరించుకుని బుధవారం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి మరియు రాష్ట్ర యువ నేత ఎమ్మెల్సీ తనయుడు వై.భీమ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తయారుచేసిన కేకును ఎమ్మెల్సీ సతీమణి ఉమాదేవి చేతుల మీదుగా కట్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొనకొండ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, తిప్పారెడ్డి రామచంద్ర, లాలప్ప, సూరి, ఎర్రి స్వామి, అర్జున్‌, విజయ్‌ కుమార్‌, భాస్కర్‌ రెడ్డి, తిరుపాల్‌, గురు ప్రసాద్‌ మహాలింగ, తిమ్మారెడ్డి, దేవేంద్ర గురు, మరియు నియోజకవర్గ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానులు, వైఎస్‌ఆర్సిపి పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img