Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు ఎం రాజు
విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లాలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకరావుకు ఎమ్మార్పీఎస్‌ అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల రవి విజ్ఞప్తి చేశారు. మంగళవారం విజయవాడలోని చైర్మన్‌ కార్యాలయంలో ఆయనను కలిసి జిల్లాలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. చైర్మన్‌ కూడా సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. చైర్మన్‌ ను కలిసిన వారిలో ఉరవకొండ తాలూకా ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img