Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

పార్టీ గెలుపే లక్ష్యంగా గృహ సారథులు పనిచేయాలి

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర- ఉరవకొండ : వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపే లక్ష్యంగా గృహ సారథులు పనిచేయాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బైపాస్ సమీపంలో ఉన్న దేవాంగ కల్యాణ మండపంలో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా కృషి చేయాలని, బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభివృద్ధి, గెలుపుకు సంబంధించిన అంశాలపై గృహ సారథులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ యువనేత ప్రణయ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img