Friday, May 3, 2024
Friday, May 3, 2024

పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలు

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో పిచ్చికుక్క సైరవిహారం చేసింది దాడి చేసి 8 మందిని తీవ్రంగా గాయపరిచింది. మంగళవారం పట్టణంలోని పాత స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలోనూ మరియు పంచాయతీ కార్యాలయం వద్ద దారిలో పోతున్న వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది వారందరూ కూడా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారులో లత్తవరం గ్రామానికి చెందిన జగనాథ్‌, ఇంద్రావతి గ్రామానికి చెందిన రవీంద్ర, హోతురు గ్రామానికి చెందిన రమేష్‌, ఉరవకొండ పట్టణానికి చెందిన రఘు, జైను, కౌసర్‌ మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు గాయపరిచిన పిచ్చికుక్క ఎంతమంది పై దాడి చేస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img