Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాజ్యాంగ నిర్మాత ఆశాలను కొనసాగిద్దాం

యువత స్ఫూర్తిదాయకం కావాలి
విశాలాంధ్ర` కళ్యాణదుర్గం టౌన్‌ :
భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని యువతీ యువకులకు స్ఫూర్తిదాయకమని ఆర్డిఓ నిశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ ,కుల సంఘాల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నివాళులర్పించి వారు మాట్లాడుతూ సామ్యవాద, లౌకిక ,ప్రజాస్వామ్య ,సాధన కోసం ఎనలేని పోరాటాలు చేసి సాధించిన వ్యక్తి డాక్టర్‌ బి.ఆర్‌ సాహెబ్‌ అంబేద్కర్‌ అని వారు పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని కాలరాస్తున్న జగన్‌ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అబాసు పాలు చేస్తున్నారని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్‌ చౌదరి పేర్కొన్నారు. కంబదూరు కళ్యాణదుర్గం ప్రాంతాలలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి శాంతియుతంగా వినతి పత్రాలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img