Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సిపిఐ ఎంపీటీసీ సభ్యుడిని అనర్హుడుగా ప్రకటించండి

సిపిఐ నాయకులు విజ్ఞప్తి

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని తొమ్మిదవ ఎంపిటిసి స్థానంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ గుర్తుపై గెలిచిన వన్నూరు సాహెబ్‌. అధికార వైసీపీ పార్టీలో చేరాడని అతనిని ఎంపీటీసీ సభ్యుడిగా అనర్హుడుగా ప్రకటించాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జె మల్లికార్జున, మరియు ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు మంగళవారం ఎంపీడీవో కు వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున మాట్లాడుతూ సిపిఐ పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చయకుండానే అధికార వైసిపిలో చేరడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వేరే పార్టీలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాలని గతంలో ప్రకటించడం జరిగిందని ఉరవకొండలో సిపిఐ పార్టీ ఎంపీటీసీ గా గెలుపొందిన వన్నూరు సాబ్‌ చేత ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. వన్నూరు సాహెబ్‌ స్వచ్ఛందంగా ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేయాలని లేని పక్షంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున మహిళా నాయకులు వన్నూరమ్మ, నూర్జహాన్‌, గణప మల్లికార్జున ఏఐటీయూసీ నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img